గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటివరకు వచ్చిన రామ్ చరణ్ సినిమాల్లో నటన పరంగా అన్నిటికంటే ఎక్కువ మార్కులు వచ్చింది ఈ సినిమాకే. అయితే రంగస్థలం తాజాగా జపాన్ లోను విడుదల అయింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చాలా లిమిటెడ్ స్క్రీన్ లలో రిలీజ్ అయిన ఆ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
కేవలం 100లోపు స్క్రీన్స్ లో రిలీజ్ అయిన రంగస్థలం జపాన్ లో ఈ సంవత్సరం ఆల్ టైం ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఫస్ట్ డే నే అక్కడ 3 మిలియన్ యెన్స్ వసూలు చేయగా, ఫస్ట్ వీక్ ముగిసేసరికి 15 మిలియన్ల యెన్ జాపనీస్ కలెక్షన్లు సాధించింది. ఇక రంగస్థలం చిత్రానికి పోటీగా అదే రోజు యష్ నటించిన కెజిఎఫ్ రెండు పార్ట్ లు కూడా రిలీజ్ చేయగా, ఆ రెండిటికంటే కూడా రంగస్థలానికే జపాన్ ఆడియన్స్ ఓటేస్తున్నారు.
అయితే రంగస్థలం సినిమాకి ప్రమోషన్స్ లేకపోయినా, ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ఈ ఓపెనింగ్స్ కి హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే రామ్ చరణ్ ఇంకా చిత్ర యూనిట్ కలిసి ఇప్పుడు రంగస్థలం చిత్రాన్ని జపాన్ వెళ్లి ప్రమోట్ చేస్తే అక్కడ భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కానీ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఇటు మైత్రి మూవీ మేకర్స్ కూడా తమ తమ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రంగస్థలం మేకర్స్ ఒక్కసారి జపాన్ వెళ్లి ప్రమోట్ చేస్తే ఆ చిత్రం మరింత ప్రేక్షకాదరణ పొందడమే గాక, రామ్ చరణ్ కి కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News