Tollywood Heros : పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్వయంకృషితో తమను తాను నిలబెట్టుకొని హీరోలైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మొదటగా స్వయంకృషితో హీరో అయి తనకంటూ ఒక స్టార్డం సాధించుకొని నేడు తెలుగు ప్రేక్షకులకు గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో అంటే అందరికీ టక్కును గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడున్న ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలకి, చాలామంది దర్శకులకి మెగాస్టార్ చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్.

మెగాస్టార్ చిరంజీవి ను ఇన్స్పిరేషన్ గా పెట్టుకొని చాలామంది నటులుగా ఎదిగారు. హీరోలుగా ఎదిగారు. దర్శకులుగా కూడా మారారు. అయితే రీసెంట్ టైమ్స్ లో స్వయంకృషితో ఎదిగిన ఇద్దరు హీరోలు గురించి చెప్పుకుంటే ఒకటి నవీన్ పోలిశెట్టి ఇంకా రెండు సుహాస్ అని చెప్పొచ్చు. వీరికంటే ముందు రవితేజ, నాని వంటి హీరోలు కూడా స్వయంకృషితో తమ జర్నీ స్టార్ట్ చేసి తమకంటూ ఒక స్టార్డం ను తెచ్చుకున్నారు.

ఇకపోతే ఇప్పుడున్న ఇద్దరు యంగ్ హీరోలు మాత్రం తమ కెరియర్ ను చాలా పద్ధతిగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. నవీన్ పోలిశెట్టి వన్ నేనొక్కడినే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో కనిపించి నటుడుగా ఒక గుర్తింపు అయితే సాధించుకున్నాడు. నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఏళ్లు గ్యాప్ తీసుకొని బాలీవుడ్లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు.

- Advertisement -

స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకుడిగా పరిచయమైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సంచలనమైన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చేసిన చంటబ్బాయి సినిమా తర్వాత అంతటి డిటెక్టివ్ కామెడీ ఫిలిం ని మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ఆ సినిమాతో అందించాడు. అక్కడితో నవీన్ పోలిశెట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన హీరో దొరికాడు అనే పేరును సాధించుకున్నాడు.

ఆ తర్వాత అనుదీప్ కేవి దర్శకత్వంలో చేసిన జాతి రత్నాలు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతి రత్నాలు సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత రీసెంట్ గా చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

ఇకపోతే యూటూబ్ వీడియోస్ ద్వారా తనకంటూ ఒక పేరు సాధించుకొని, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరోగా కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. ఆ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యే అవకాశం రాకపోయినా కూడా ఓటీటీ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమాతో థియేటర్ వద్ద కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు సుహాస్.

ఇప్పుడు సుహాస్ చేస్తున్న సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుందని దాదాపు ఆడియన్స్ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సాధించడమే కాకుండా ఓటిటిలో రిలీజ్ అయిన తర్వాత విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

ఈ యంగ్ హీరోలు ఇద్దరు చేసినవి మూడేసి సినిమాలు అయినా కూడా అవి ప్రేక్షకులను బాగానే అలరించాయి. ప్రస్తుతం ఈ తరంలో మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని కెరీర్ ని ముందుకు సాగిస్తున్న ఈ హీరోలకి ఒక మినిమం గ్యారెంటీ మార్కెట్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు