Naveen Polishetty: మైత్రి మూవీ మేకర్స్ తో మిస్టర్ శెట్టి మూవీ?

Naveen Polishetty:

టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా మైత్రి మూవీ మేకర్స్ హవాయే నడుస్తుంది. ఈ నిర్మాతలు పట్టిందల్లా బంగారమైపోతుంది. ముఖ్యంగా ఈ బ్యానర్ లో వచ్చిన పెద్ద సినిమాలు దాదాపుగా బ్లాక్ బస్టర్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. శ్రీమంతుడు, రంగస్థలం, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ బ్యానర్ నుండి వచ్చినవే. ముఖ్యంగా ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాలే కావడం విశేషం.

ఒకే బ్యానర్ లో సంక్రాంతికి ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు తీసుకువచ్చిన ఘనత మైత్రి నిర్మాతలకు దక్కింది. పైగా అందులో వీర సింహారెడ్డి సూపర్ హిట్ కాగా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ బ్యానర్ నుండి వచ్చే చిన్న సినిమాలు మాత్రం అంతగా ఆడట్లేదు. కంటెంట్ పరంగా కొన్ని సినిమాలు బాగానే ఉన్నా, రిలీజ్ అయిన టైం బ్యాడో, లేక మరేం రీజనో తెలీదు గాని అంతగా ఆడలేదు,

ఈ ఇయర్ వచ్చిన మీటర్, ఏమిగోస్, ఖుషి కూడా అంత సక్సెస్ కాలేదు. అయినా సరే చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో ఇప్పుడు ఒక లక్కీ హీరోతో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో నవీన్ పోలిశెట్టిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కలిసి విష్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ తో త్వరలో పని చేయడానికి ఎదురుచూస్తున్నట్టు హింట్ ఇచ్చేసారు. ఇక రేపో మాపో సెట్టయ్యేలా ఉంది. మరి నవీన్ హాట్ట్రిక్ బ్లాక్ బస్టర్స్ లక్ తోడై, మైత్రి వాళ్ళకి కలిసొచ్చి హిట్ కొడతారేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు