బాలీవుడ్ లో భారీ చిత్రాలు తీసే నిర్మాత ఎవరంటే అందరు చెప్పే పేరు కరణ్ జోహార్. బాలీవుడ్ లో స్టార్స్ తో సినిమా తీయాలన్న, స్టార్ కిడ్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా ముందుండేది కరణ్ జోహారే. అలాంటి ఈ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ డైరెక్టర్ గా కూడా పలు సూపర్ హిట్ సినిమాలను తీసాడు. “కభీ ఖుషి కభి ఘమ్”, కుచ్ కుచ్ హోత హై లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన కరణ్ జోహార్ మళ్ళీ ఏడేళ్ల గ్యాప్ తర్వాత డైరెక్టర్ గా మళ్ళీ సినిమా చేసాడు. అదే “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని”.
రణవీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా లవ్&ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో స్వీయ నిర్మాణంలో కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ సినిమా బడ్జెట్ దాదాపు రిలీజ్ కి ముందే రికవరీ చేసినట్టు సమాచారం.
అదెలాగంటే డిజిటల్ రైట్స్ కింద 80 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 50 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కింద 30 కోట్లు, ఇలా కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఏకంగా 160 కోట్ల దాకా రికవరీ సొంతం అయ్యిందని సమాచారం. అయితే ఒక ఫ్యామిలీ సినిమాకి ఈ రేంజ్ బడ్జెట్ ఎందుకయ్యింది అని సోషల్ మీడియా లో ట్రోల్స్ వస్తున్నాయి.
ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కేవలం 50కోట్లే అని టాక్ నడుస్తుంది. ఆ రకంగా కరణ్ జోహార్ సినిమా ఇండియన్ కరెన్సీ లో ఒక 100కోట్ల గ్రాస్ అందుకుంటే సరిపోతుంది. ఏది ఏమైనా కరణ్ జోహార్ బిజినెస్ ప్లానింగ్ మాత్రం అదుర్స్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని జులై 28న రిలీజ్ అవుతుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News