Virupaksha: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

మెగా హీరో సాయి ధరం తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి ధరంతేజ్… వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇట్లు మరియు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు సాయిధరమ్ తేజ్.

ఇక బైక్ యాక్సిడెంట్ తర్వాత విరుపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి ధరంతేజ్. ఈ సినిమాను కార్తీక్ దండు చాలా గ్రాండ్ గా తెరకు ఎక్కించాడు. కొత్త దర్శకుడు అయినప్పటికీ ఏమాత్రం తడబడకుండా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. హారర్ కథాంశం తో వచ్చిన ఈ సినిమా.. దాదాపు 200 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

ఈ సినిమా బడ్జెట్  100 కోట్లు అయితే… దానికంటే డబుల్ వసూలు చేసింది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంయుక్త మీనన్ ను పాత్రలో మొదట… ఈమెను అనుకోలేదట. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర ను అనుకున్నారట దర్శకుడు.  అయితే తనకు డేట్స్ లేవని… కథ నచ్చినప్పటికీ సింపుల్ గా అనుపమ పరమేశ్వరన్… విరూపాక్ష సినిమాను రిజెక్ట్ చేశారట. దీంతో సంయుక్త మీనన్ ను ఫైనల్ చేసింది చిత్ర బృందం. ఒకవేళ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నటించి ఉంటే… ఆమెకు మంచి విజయం అందేది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు