Odela 2 : చేతులు మారిన క్రేజీ సీక్వెల్… ఎందుకంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన నెక్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన బోల్డ్ మూవీ “ఓదెల” సీక్వెల్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి పార్ట్ కు కథను అందించిన డైరెక్టర్ సంపత్ నంది సీక్వెల్ కు మాత్రం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే “ఓదెల”ను ప్రొడ్యూసర్ కేకే రాధా మోహన్ నిర్మించారు. సీక్వెల్ ఎందుకు నిర్మాతల చేతులు మారింది? అంటే…

“ఓదెల”కు నిర్మాత చేంజ్…
సంపత్ నంది క్రియేటివ్ హెడ్ గా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా, అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన మూవీ “ఓదెల రైల్వే స్టేషన్”. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో కేకే రాధా మోహన్ నిర్మించారు. 2022 ఆగస్టులో డైరెక్ట్ గా “ఆహా”లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా సీక్వెల్ ను ప్లాన్ చేశారు. అయితే సాధారణంగా సీక్వెల్ అనగానే దాదాపుగా ముందున్న పాత్రలను కొనసాగిస్తూ, కొత్త రోల్స్ ను పరిచయం చేస్తారు. కానీ “ఓదెలా 2″లో మాత్రం ఏకంగా మెయిన్ లీడ్ నే మార్చేశాడు సంపత్ నంది. ఈ సీక్వెల్ కు కూడా డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా, తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది మూవీని పర్యవేక్షిస్తూ, నిర్మిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం బాక్స్ బ్యానర్లపై డి మధు, సంపత్ నంది ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంటే హీరోయిన్ మాత్రమే కాదు నిర్మాత కూడా మారారు. మరి ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాత రాధామోహన్ ఎందుకు తప్పుకున్నారు? అంటే…

నిర్మాత రాధా మోహన్ వివరణ ఇదే…
రాధా మోహన్ నిర్మిస్తున్న “భీమా” మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీ మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత రాధ మోహన్ “ఓదెల” సీక్వెల్ ను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని వెల్లడించారు. తను సంవత్సరానికి ఒక సినిమాను మాత్రమే నిర్మిస్తానని, అయితే ఇప్పుడు “భీమా” రిలీజ్ కు సిద్ధంగా ఉండగా, మరోవైపు ఆయుష్ శర్మతో చేసిన హిందీ మూవీ రుస్లాన్ నిర్మాణ దశకు చేరుకుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ కూడా చేయబోతున్నామని వెల్లడించారు. అయితే ఈ మూడు సినిమాలకు సంబంధించిన క్యాష్ ఫ్లోస్, అలాగే రిలీజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండడంతో డైరెక్టర్ సంపత్ నంది మరో ప్రొడ్యూసర్ తో సీక్వెల్ ను రూపొందించాలని భావించినట్టు రాధామోహన్ చెప్పుకొచ్చారు. అయితే స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే సంపత్ నంది ఈ మూవీని నిర్మించాలనుకుంటున్నారా లేదా అని తనను అడిగారని, తన సమాధానం విన్న తర్వాతనే ఇతర ప్రొడ్యూసర్స్ వద్దకు వెళ్లాడని నిర్మాత రాధా మోహన్ అన్నారు.

- Advertisement -

“ఓదెల 2” స్టోరీ ఇదే…
ఓదెల రైల్వే స్టేషన్ మూవీలో హెబ్బా పటేల్ బోల్డ్ సీన్స్ లో నటించి టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో సీక్వెల్లో తమన్నా నటిస్తుండడం చర్చకు దారి తీసింది. ఈ థ్రిల్లర్ మూవీలో తమన్నా స్క్రీన్ పై మరింత రెచ్చిపోయి నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. “ఓదెల 2” మూవీ స్టోరీ విషయానికి వస్తే… ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఎలా రక్షిస్తాడు ? అనే లైన్ తో సీక్వెల్ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. మల్లన్న స్వామి ప్రతిరూపంగా పూజించబడే శివుని త్రిశూలం తోనే ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా లీక్ అయిన ఒక పిక్ లో తమన్నా సాధువుగా కనిపించింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు