Koratala : స్టోరీనే మార్చేశాడా ?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అంచనాలు మరింత పెరిగిన విషయం తెలిసిందే. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుందని క్లారిటీ కూడా ఇచ్చారు.

ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంచాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొరటాల శివ ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన మోషన్ పోస్టర్ ని కూడా వదిలారు. అయితే కొరటాల శివ ముందు అనుకున్న కథను పక్కనపెట్టి కొత్త పాన్ ఇండియా కథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ చాలా భారీగా ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ముందుగా అనుకున్న కథలో నుంచి కొన్ని సన్నివేశాలను ఈ కథలో జోడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ ఈ సినిమాపై ఎంతగా దృష్టి పెట్టాడో అర్థం అవుతుంది. ఈ మూవీ నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు