నాని హీరోగా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన దసరా సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాని తన కెరీర్లో తొలిసారి ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్ లో కనిపించి అలరించాడు. ఒక డెబ్యూ డైరెక్టర్ ని నమ్మి ఇంత రిస్క్ చేసిన నానికి ప్రశంసలు అందాయి. విలేజ్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో కీర్తి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. నాని కెరీర్లో దసరా సినిమా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, ఈ సినిమా వల్ల నానికి మంచి పేరు వచ్చింది కానీ, పైసా కూడా లాభం తెచ్చిపెట్టలేదని అంటున్నారు.
వివరాల్లోకి వెళితే, నాని ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకొని నిర్మాతకి భారం కాకూడదని భావించి శాటిలైట్ రైట్స్ తీసుకున్నాడట. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాని థియేటర్లో, ఓటీటీలో చాలా మంది చూడటం వల్ల శాటిలైట్ రైట్స్ కి పెద్దగా డిమాండ్ ఏర్పడలేదు. దీంతో ఫ్యాన్సీ అమౌంట్ పెట్టి శాటిలైట్ రైట్స్ కొనేందుకు ఏ ఛానల్ ముందుకు రావట్లేదని టాక్. ఆ రకంగా నాని చేసిన తప్పు వల్ల దసరా సినిమా ద్వారా పైసా కూడా మిగల్లేదని అంటున్నారు. ఓటీటీ వచ్చాక జనాలు టీవీల్లో సినిమాలు చూడటం చాలావరకు తగ్గిందని చెప్పాలి. థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా నెలరోజుల తర్వాత ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ లో స్ట్రీమ్ అవ్వటమే ఇందుకు కారణం.
నిర్మాతకి భారం కాకూడదు అన్న నాని నిర్ణయం మంచిదే కానీ, శాటిలైట్ రైట్స్ కి బదులు డిజిటల్ రైట్స్ గనక తీసుకొని ఉంటే భారీ మొత్తంలో లాభం వచ్చేదని అంటున్నారు. అయితే ఇదే ట్రెండ్ గనక కొనసాగితే నిర్మాతలు శాటిలైట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇక మరచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి తానొకటి తలిస్తే, దైవం ఇంకొకటి తలచినట్టు నిర్మాతకి భారం కాకూడదని నాని తీసుకున్న నిర్ణయం తన మెడకే చుట్టుకుందన్నమాట.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News