Gopichand 32: నిర్మాతల మధ్య విభేదాలతో గోపీచంద్ మూవీపై ఊహించని ఎఫెక్ట్

Gopichand 32

మాచో స్టార్ గోపీచంద్ 32వ సినిమా డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సంబరపడిన గోపీచంద్ అభిమానులకు షాక్ ఇచ్చే విషయం ఒకటి బయటకు వచ్చింది. నిర్మాతల మధ్య విభేదాల కారణంగా ప్రాజెక్టు Gopichand 32 చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది.

హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల పరిస్థితి సినిమాల పరంగా అసలు ఏం బాలేదు. ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ వరుస డిజాస్టర్లు అందుకున్నవారే. అయితే వీరిద్దరూ తమ కాంబోలో సినిమా ఫిక్స్ చేసి, స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేయడమే కాకుండా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. Gopichand 32 సినిమాలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో వేణు ధోనెపూడి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఇప్పుడు చేతులు మారబోతున్నట్టు సమాచారం. ఇక దీనికి ముఖ్య కారణం నిర్మాతల మధ్య నెలకొన్న విబేధాలు అని తెలుస్తోంది.

ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి నిర్మాతగా ఈ మూవీ రూపొందుతుండగా, మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత సైన్ స్క్రీన్స్ నిర్మాత హరీష్ పెద్ది ఈ ప్రాజెక్టులో సహ నిర్మాతగా చేరారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిర్మాతలు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి, పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా ఈ సినిమా కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చులన్నీ విశ్వ ప్రసాద్ తిరిగి ఇచ్చేస్తారని అంటున్నారు. ఈ విషయం గురించి డైరెక్టర్ శ్రీనువైట్ల అండ్ టీం నిర్మాతతో కలిసి పలు సమావేశాలను నిర్వహించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఏదైతేనేం ఎంటర్టైనింగ్ కంటెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాను నిర్మించడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఎగ్జైటింగ్ గా ఉన్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే మేకర్స్ యూరప్, మనాలిలో Gopichand 32 సినిమా షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి, వేసవిలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు గోపీచంద్ హీరోగా నటించిన మరో సినిమా “భీమా” రిలీజ్ కు రెడీ అవుతోంది. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ కనిపించబోతున్నారు. “భీమా” మార్చ్ 8న రిలీజ్ కానుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు