Hidimba: ఆ సినిమాకు సెన్సార్ కష్టాలు – రిలీజ్ కష్టమేనా..?

అశ్విన్, నందిత శ్వేత హీరో హీరోయిన్లుగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన సినిమా ‘హిడింబ’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై ఆసక్తిని పెంచింది. జులైలో రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా సెన్సార్ కష్టాల్లో పడ్డట్టు సమాచారం అందుతోంది. సినిమాలో నరమాంస భక్షకులకు సంబంధించిన సీన్లలో హింస మోతాదుకు మించి ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సెన్సార్ బోర్డు తిరస్కరించడంతో ఈ సినిమాను రివ్యూకి పంపినట్లు సమాచారం అందుతోంది. హింస మోతాదు ఎక్కువైనా సినిమాలకు ఎక్కువ కట్స్ చెప్పడం చూశాం కానీ, సెన్సార్ చేయకుండా వెనక్కి పంపారంటే వాయిలెన్స్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు.

ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉండగా సినిమాలో మార్పులు చేసి థియేటర్లో రిలీజ్ చేస్తారా లేక ఓటీటీ సెన్సార్ పరిధిలోకి రాదు కాబట్టి సినిమాలో ఏ మార్పులు చేయకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని జానర్లో, చెప్పని కథతో వస్తున్నాం అని ప్రచారం చేసిన సినిమా యూనిట్ ఇప్పుడు ఈ సెన్సార్ కష్టాలను ఎలా అధిగమిస్తుందో చూడాలి.

వాయిలెన్స్ ని కూడా క్రియేటివ్ గా, స్టైలిష్ గా చూపిస్తూ చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్య కాలంలో. అలాంటిది ఈ సినిమాలో ఇంత రియలిస్టిక్ గా చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెరీర్ ఆరంభం నుండి డిఫరెంట్ స్టోరీస్ తో సరైన బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నిస్తున్న అశ్విన్ బాబుకి హిడింబ సినిమా ద్వారా హిట్ దక్కుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు