Chatrapathi: డిజాస్టర్ తర్వాత  క్రేజీ డైరెక్టర్ తో బెల్లంకొండ శ్రీనివాస్..!

అల్లుడు శీను సినిమాతో హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా భారీ కాస్టింగ్, బడ్జెట్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఘోర డిజాస్టర్ చవి చూశాడు సాయి శ్రీనివాస్. ఛత్రపతి తర్వాత మరో బాలీవుడ్ సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి కానీ, మళ్ళీ తెలుగు సినిమాతో రానున్నాడు బెల్లంకొండ. భీమ్లా నాయక్ సినిమా డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్లో చేయనున్న సినిమాకు పూజా కార్యక్రమం ఇవాళ జరిగింది.

దర్శకుడు హరీష్ శంకర్ అతిధిగా పాల్గొని దేవుడి పఠం మీద క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు పరశురామ్ పెట్ల కెమెరా స్విచ్ ఆన్ చేసాడు. రాక్షసుడు సినిమా తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ హిట్ లేని సాయి శ్రీనివాస్ కి ఈ సినిమా హిట్ అవ్వడం కీలకంగా మారింది. భీమ్లా నాయక్ సినిమా ద్వారా హిట్ అందుకున్న సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి బెల్లంకొండకి ఈ సినిమా ద్వారా కం బ్యాక్ వస్తుందని టాక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

చడీ చప్పుడు లేకుండా 14రీల్స్ బ్యానర్ పై మొదలైన ఈ సినిమా గురించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. రాక్షసుడు సినిమా ద్వారా కొద్దిగా ట్రాక్ లో పడ్డట్టు కనిపించిన సాయి శ్రీనివాస్ కెరీర్ ఛత్రపతి సినిమా జీరో షేర్ తో హ్యూజ్ డిజాస్టర్ కావటంతో మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. మరి ఈ సినిమా కోసం ఎలాంటి కథతో వస్తాడు, పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తాడా వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు