ANIMAL : రణ్ బీర్ పరువు తీసిన మల్లారెడ్డి…!

ఈ మ‌ధ్య‌ సినిమా ఫంక్ష‌న్లకు రాజ‌కీయ నాయ‌కులు కూడా హాజ‌ర‌వ్వ‌డం క‌నిపిస్తోంది. అయితే సినిమా ఫంక్ష‌న్ల‌కు నేత‌లు హాజ‌రైన‌ప్పుడు క‌లిగే న‌ష్టం ఏమీ లేదు. కానీ వాళ్ల హైప్ కోసం చేసే కామెంట్స్ కొన్ని సార్లు అక్క‌డ ఉన్న‌వారిని, సినిమాను కూడా ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయి. తాజాగా యానిమ‌ల్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా అదే జ‌రిగింది. యానిమ‌ల్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లోని మ‌ల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు రాజ‌మౌళి, మ‌హేశ్ బాబుతో పాటూ మంత్రి మ‌ల్లారెడ్డి కూడా హాజ‌ర‌య్యారు.

ఇక మ‌ల్లారెడ్డి మైక్ ప‌ట్టుకున్నాడంటే ఎలా మాట్లాడ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న కామెంట్ల‌తోనే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో హీరోల కంటే కూడా సోష‌ల్ మీడియాలో తానే ఫేమ‌స్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక నిన్న యానిమ‌ల్ ఈవెంట్లో ఆయ‌న హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ ఇబ్బంది పడే వ్యాఖ్యలు చేశారు. మరో ఐదు సంవత్సరాలలో హాలీవుడ్, బాలీవుడ్ ను కూడా తెలుగు వాళ్లు ఏలుతారని వ్యాఖ్యానించారు. నువ్వు కూడా మరో ఏడాదిలో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతావంటూ కామెంట్ చేశారు. ముంబై పాతదైపోయిందని..బెంగుళూరు ట్రాఫిక్ జామ్ అని హైదరాబాద్ ఇండియాను ఏలుతుందని వ్యాఖ్యానించారు.

రాజమౌళి, దిల్ రాజు తెలివైనవారని ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా వచ్చాడని అన్నారు. మల్లారెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. తెలుగు సినిమాలను ప్రేమిస్తామని అంతే కానీ తమ ప్రాంతాన్ని తమ ఇండస్ట్రీని తక్కవ చేసి చూడవద్దని కోరతున్నారు. కొందరు బాలీవుడ్ ప్రేక్షకులు అయితే సినిమాను బైకాట్ చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి కామెంట్స్ తో రణ్ బీర్ కపూర్ కూడా ఇబ్బంది పడ్డారు. తమ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడున్న సమయంలో ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందేమో అని సైలెంట్ గా ఉండిపోయాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు