Biggboss season7: నామినేషన్ లో ఏడుపే.. చెప్పింది వినకపోతే ఏడుపే..

టెలివిజన్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ నామినేషన్లలో ఎక్కువగా రివెంజ్ నామినేషన్లే జరగగా అందులో భోలేvs అమర్, యావర్ vs అశ్విని నామినేషన్లు ఎక్కువ రైజ్ అయ్యాయి. అయితే అశ్విని నామినేషన్ విషయానికొస్తే ఆమె వరకు సీరియస్ గా జరిగినా, హౌస్ మేట్స్ పరంగా ఫన్నీగా అనిపించింది.

ఎందుకంటే నామినేట్ చేస్తున్న టైం లో అశ్విని చెప్పిన పాయింట్ వినకుండా ప్రతి పాయింట్ ని కూడా అర్ధం చేసుకోలేదు. యావర్ అశ్విని ని నామినేట్ చేస్తూ 5 రకాల పాయింట్స్ చెప్పి నామినేట్ చేసాడు. అందులో ఒక్క పాయింట్ కి కూడా ఒప్పుకోలేదు సరికదా, రంగు కొట్టించుకున్నాక ఏడుపు మొహంతో వెళ్ళింది. ఆ తర్వాత అక్కడితో వదిలేయకుండా, తనని నామినేట్ చేసిందనుకు రివర్స్ గా యావర్ ని నామినేట్ చేస్తూ, నువ్వు నన్ను గెలికిందనుకు నేను నిన్ను గెలికాను అని ఎటకారంగా సమాధానం చెప్తూ హౌస్ లో ఒక జోకర్ అయింది.

అయితే ఇంత జరిగాక కూడా నామినేషన్ విషయాలు అక్కడితో వదిలేయకుండా ప్రియాంక ని యావర్ నామినేట్ చేసిన పాయింట్ లో ఒక్కటైనా సరైందా అని తనని అడిగింది. ప్రియాంక మెల్లిగా ఇప్పుడు ఈ వాదనలు అనవసరం అని చెప్తూ సింపుల్ గా ముగిస్తే, చెప్పేది కూడా వినలేదని శివాజితో మొర పెట్టుకుంది. ఆయన కూడా దీన్ని లైట్ తీసుకోమనగా ఏడుపు మొహం పెట్టుకు కూర్చుంది. హౌస్ లో ఏమో గాని ట్రోలర్స్ కి మాత్రం అడ్డంగా బుక్ అయింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossips. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు