బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్- రణ్బీర్ కపూర్ కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎట్టకేలకు ఏప్రిల్ 14 న వివాహం చేసుకున్నారు. ఇరువురు కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బ్రహ్మాస్త్రం సినిమా కూడా చేస్తున్న సంగతి విదితమే. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ సంజు సినిమా తరువాత రణబీర్ కపూర్ చేస్తున్న సినిమా “షంషేరా”. సంజయ్ దత్, వాణి కపూర్ తో పాటు భారీ తారాగణం “షంషేరా” లో కనిపించనుంది కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 22 న 2022న హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.
రణబీర్ అభిమానులకి ఈ ఇయర్ లో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే ఆనందం కంటే దానికి మించిన ఆనందాన్ని ఇచ్చే వార్త బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్- రణ్బీర్ కపూర్ దంపతులు తల్లిదండ్రులు కాబోతుండటం.
ఈ విషయాన్ని స్వయంగా అలియా-రణ్ బీర్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలియా ఇన్స్టాగ్రామ్లో తల్లి కాబోతున్నట్లు, హాస్పిటల్లో స్కాన్ మానిటర్ చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. మా బేబి త్వరలోనే రానుందంటూ తెలియజేశారు.