Salaar 2 Update : ప్రొడ్యూసర్ భారీ ప్లాన్… బాలీవుడ్ స్టార్ నే దింపుతున్నారు

Salaar 2 Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం “సలార్”. అయితే ఈ చిత్రం నుండి ఒక సరికొత్త అప్డేట్ వచ్చింది. ప్రభాస్ కెరీర్ లో రెండో అతి పెద్ద హిట్ గా నిలిచిన సలార్ మూవీ సీక్వెల్ వస్తోందని ఆ చిత్ర నిర్మాణ వర్గం తెలియజేసింది. మొదట్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళేందుకు టైమ్ పడుతుందని ఊహాగానాలు వినిపించినా ప్రస్తుత పరిస్థితుల రీత్యా వెంటనే మొదలవుతుంది అని తెలిసింది.

ఇప్పటి తాజా కథనం వచ్చే మే నెలలో ఈ చిత్రం మొదలు కావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో మరోసారి సలార్ మూవీ మరో భారీ థ్రిల్లర్ కి తెరలేపనుంది . సలార్ 2 కి సంబంధించి ఈ పాటికే కొంతమేర షూట్ పూర్తి చేశారని సమాచారం. ఇక మిగతా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, ఈ చిత్రానికి సంబంధించి ఒక సర్ప్రైస్ కూడా ఉందని చెబుతున్నారు. అదేంటంటారా.? ఈ సినిమాలో వచ్చే ఓ అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరి నిజంగానే అమితాబ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారో లేదో, చూడాలి. అయితే సలార్ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో రాజమన్నర్ పాత్రను చంపటంతో ఇంటెర్వెల్ కథ ఇంకొక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుందని, అదే విధంగా స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, గోపిచంద్ లు కూడా గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశముందని చెప్పుకుంటున్నారు.    సినీ నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పార్ట్-2ని త్వరగా ఫినిష్ చేసి.. 2025లో రిలీజ్చేస్తామని ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండనుందని ఆయన తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు