Jabardasth Beauty: అనసూయ కు అలా పిలిస్తే చాలా కోపం వస్తుందట

‘జబర్థస్త్’ యాంకర్‌ గా తెలుగు ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకొని, క్షణం మూవీ తో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి రంగస్థలం లో రంగమ్మత్తగా అలరించి పబ్లిక్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించింది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ నటి సోషల్ మీడియా లోను యాక్టీవ్ గా ఉంది. అయితే అనసూయ యాంకర్ కాకముందు ఒక న్యూస్ ఛానల్ లో రీడర్ గా కూడా పని చేసింది. ఆ తర్వాతే టీవీ లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనసూయ. వీరికి ఇద్దరు పిల్లలు.

అయితే యాంకరింగ్ కు స్వస్తి చెప్పిన అనసూయ సినిమాలు మాత్రం చేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియా లోను యాక్టీవ్ గా ఉంటుంది. అయితే రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో ఒక వ్యక్తి ‘అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకంత కోపం వస్తుంది ?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ‘నాకు కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ల అర్థాలు వేరే ఉంటాయి. ఏదేమైనా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ ఖర్మ దాన్ని వదిలేస్తున్న. ఎందుకంటే దానికంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి. అందుకే, నేను అలాంటి చెత్త కామెంట్లు పట్టించుకోవటం లేదు’ అని అనసూయ సమాధానం ఇచ్చారు.

ఇక తన కొత్త సినిమా సంగతులు చెబుతూ.. ఏప్రిల్ రెండో వారంలో తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పింది. అలాగే ప్రస్తుతం పుష్ప 2 ఇంకా ఫ్లాష్ బ్యాక్ అనే తమిళ సినిమాలో కూడా నటిస్తున్నాను అని చెప్పింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు