Varasudhu: ఒకరోజు ముందుగానే

తమిళ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తీస్తున్న లేటెస్ట్ మూవీ వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్. తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు, తమిళ ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

వారసుడు సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం స్టార్ట్ చేసింది. ఈ మూవీని ఈ సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే, ఈ సినిమాలో హీరో ఉమ్మడి కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబం పాలిట విలన్ గా తయారవుతాడు ప్రకాష్ రాజ్. అతన్ని ఎదిరించి తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడనేదే కథ అనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థం అవుతోంది.

విజయ్ సరసన హీరోయిన్ గా రష్మిక సందడి చేయనున్న ఈ సినిమాలో, శరత్ కుమార్, సుమన్, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, కుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ నుంచి వచ్చిన పాటల్లో రంజితమే సాంగ్ బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ట్రైలర్ ను నెటిజన్స్… దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో వచ్చిన సినిమాల సీన్లను కాపీ కొట్టారని, ఆసీన్ లను కట్ చేసి ఇందులో పెట్టారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు