Baby : ఈ సినిమా గురించి నిజం ఇదే

ఇటీవాల కాలంలో విడుదలు అయి బాక్స్ ఆఫీసులో రికార్డులు సృష్టిస్తున్న సినిమా ‘బేబీ’ . ఈ సినిమాలో ఫేమస్ యూట్యూబర్ వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. యువతకి ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా కు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల అయిన మొదటి పాట ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ తోనే ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే ఈ సినిమా గురించి ఆ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఈ సినిమా దర్శకుడు అయిన సాయి రాజేష్ తాజా గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ బేబీ సినిమా గురించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశం గా మారాయి.ఈ కల్ట్ బ్లాక్బస్టర్ కల్పితం అని అందరూ అనుకుంటున్నారు. కానీ… ఇది కల్పిత కథ కాదట. నిజ జీవితం లో జరిగిన ఓ సంఘటన నుంచి పుట్టిన కథ అని డైరెక్టర్ తెలిపారు. ఇది నిజం గ జరిగిన ఓ యథార్థ సంఘటన ను ఆధారం గ తీసుకొని రాసారు అంటే ప్రేక్షకులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ సంఘటన తమిళనాడు లో చోటు చేసుకుందట. ఓ యువతీ ని ఇద్దరు యువకులు కలిసి దారుణం గా హత్య చేసిన సంఘటన ను ఆధారం గా తీసుకొని ఈ కథను రాసారు దర్శకుడు. ఈ సంఘటనలో ఆశ్చర్యాయమైన విషయం ఏమిటంటే, ఆ ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని ప్రేమించటం. బి టెక్ చదువుతున్న ఆ అమ్మాయి, తన క్లాస్ మెట్ తోనే కాకా ఓ ఆటో డ్రైవర్ తో కూడా స్నేహం చేసింది. ఈ విషయం ఆ ఇద్దరు యువకులకు అకస్మాత్తుగా తెలిసి, తీవ్ర ఆగ్రహానికి గురయిన వారు ముందు వెనక ఆలోచించకుండా ఆ అమ్మాయిని దారుణం గా హత్య చేసారు.

- Advertisement -

ఈ సంఘటన ను ఆధారం చేసుకొని, హత్య అనే అంశాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయి ఎలాంటి మానసిక స్థితి లో ఉంది ఉండొచ్చు అని, అసలు తాను ఎలాంటి పరిస్థితిలో ఆలా నడుచుకోవాల్సి వచ్చిందో అనే అంశంలో అలోచించి, తన కోణం నుంచి కథను చూపించేందుకు ప్రయత్నించారని అయన తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు