టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అడవి శేషు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తనదైన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలనను అందుకుంటున్నాడు. గతంలో క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న అడవి శేషు ఇటీవల మేజర్ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి ఆదరణ వచ్చింది. మేజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన తన తర్వాతి సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం హిట్ 2 సినిమా చేస్తున్నాడు అడవి శేషు. హిట్ 2 సినిమా షూటింగ్ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నట్లు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అడవి శేషు ప్రకటించాడు. మేజర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో భాగంగా ఇన్ని రోజులు బిజీ బిజీగా గడిపిన తాను అలిసిపోయానని అందుకే బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పాడు.
” మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్రనను ప్రతి ఒక్కరికీ చూపించాలనే ఉద్దేశంతో అన్ని చోట్లకు తిరుగుతూ మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. కాబట్టి కొంత బ్రేక్ కావాలని నాని, శైలేష్ ను అడిగాను. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అంటూ తన ట్విట్టర్ వేదికగా చెప్పాడు యంగ్ హీరో అడవి శేషు. దీంతో అడవి శేషు ఫ్యాన్స్ చాలా డీలా పడిపోయారు. హిట్ 2 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వస్తుందని ఎదురు చూసిన తమకు, నిరాశే మిగిలిందని ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు.