టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు తల్లి, సీనియర్ నటుడు కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు కన్నూమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. మహేష్ బాబుకి తల్లి అంటే ఎంత ఇష్టమో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన తల్లి గురించి మాట్లాడినప్పుడల్లా మహేష్ బాబు కంట తడిపెట్టడం మనం చాలా సార్లు గమనించి ఉంటాం. ఇటీవలే మహేష్ బాబు తల్లి ఆరోగ్యం సీరియస్ కావడంతో గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చేర్పించి ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స అందించారు.
సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవిని ప్రాణంగా చూసుకునే వారు. పిల్లలు పద్మ, మంజుల, ఇందిర ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్బాబు . ముఖ్యంగా ఏ పండుగ వచ్చినా మహేష్ బాబు కుటుంబం అంతా ఇందిరా దేవి ఇంట్లో వాలిపోయేవారు. ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇందిరా దేవి పుట్టిన రోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్ బాబు. ఇందిరా దేవి మనవడు గల్లా అశోక్ కూడా ఈ మధ్య హీరో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు.
ఆమె మూడు తరాల హీరోలను తన కుటుంబంలోనే చూసిన అనుభవం సొంతం చేసుకున్నారు. ఇటీవల పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందడంతో ఇందిరా దేవి కృంగిపోయారు. రమేష్ జ్ఞాపకాల నుంచి తేరుకోలేకపోయారు. కృష్ణ కుటుంబంలో అంతకు ముందు విజయ నిర్మల, ఇటీవల రమేష్ బాబు మృతి చెందడం, ఇప్పుడు ఇందిరా దేవి దూరం కావడం మరింత బాధకరం ఇవాళ మధ్యాహ్నం మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరుగనున్నాయి.