Renu Desai: కొందరు లైఫ్ లోకి అనుకోకుండా వస్తారు

ఒకప్పటి ప్రముఖ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాక్టర్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్.. ఇలా అన్ని రంగాల్లో సత్తా చాటి మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా గుర్తింపు తెచ్చుకుంది రేణు దేశాయ్. ఇక 2012లో పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ అప్పటి నుండి తన కుమారుడు అకీరా నందన్ తో పాటే ఉంటుంది. సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తన భావాలను అందులో వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈమె చేసే పోస్టులు అప్పుడప్పుడు చర్చకు దారితీస్తుంటాయి.

తాజాగా రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ మరోసారి నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్ట్ లో తనని వదిలి వెళ్లిపోయిన వాళ్లను తలుచుకొని రేణు దేశాయ్ బాధపడుతున్నట్లుగా ఉంది. “మండుటెండలో చల్లని గాలిలా అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తారు. వారి చూపులతోనే నేరుగా మన మనసుతో మాట్లాడతారు. అదొక మూగ భాష. మనం వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ.. వారి ప్రభావం మనపై శాశ్వతంగా ఉంటుంది. కానీ వాటిలో చాలా వరకు బాధాకరమైనవి కూడా ఉండొచ్చు. చాలా ఎడబాట్లు తీరని వేదన మిగుల్చుతాయి. కానీ కొందరు మాత్రమే మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు. మన కన్నీళ్లను తుడిచి కాంతిని పంచుతారు. అలాగే మనల్ని నవ్విస్తారు” అంటూ పోస్ట్ చేసింది.

అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ తన కుమారుడు అకీరానందన్ కోసం ఫారిన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫ్లైట్ లో కుమారుడితో ఉన్న వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రేణు దేశాయ్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది రేణు దేశాయ్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు