Santosh Srinivas : ఇక మెగా మేనల్లుళ్లే !

 

రామ్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో ‘కందిరీగ’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. 2011 లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ టైంకి రామ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా రికార్డు కొట్టింది. దీంతో ఎన్టీఆర్ పిలిచి మరీ ‘రభస’ అవకాశం ఇచ్చాడు. కానీ, ఆ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. దీంతో మళ్ళీ రామ్ వచ్చి అవకాశం ఇచ్చే వరకు సంతోష్ శ్రీనివాస్ ఖాళీగా ఉంటూ వచ్చాడు. రామ్ తో సంతోష్ రెండో సారి ‘హైపర్’ అనే మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీకి మొదట మంచి టాక్ వచ్చింది. కానీ తర్వాత ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది. అయినా సంతోష్ శ్రీనివాస్ అదృష్టవంతుడు అనే అనాలి. ఎందుకంటే బెల్లంకొండ సురేష్ తన కొడుకు సాయి శ్రీనివాస్ తో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. అదే ‘అల్లుడు అదుర్స్’. ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకుంది. కానీ, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సంతోష్ ను తిట్టుకున్నవారే.

ఈ సినిమా తర్వాత సంతోష్ దాదాపు ఏడాది వరకు ఖాళీగానే ఉన్నాడు. అయితే, ఈ డైరెక్టర్ మరోసారి సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడని టాక్. అందుకోసం మెగా మేనల్లుళ్ల పై కన్నేశాడు అని తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్ ఇద్దరిలో ఒకరితో సినిమా సెట్ చేసుకునే పనిలో పడ్డాడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.
అయితే వైష్ణవ్ తేజ్ 3 సినిమాలతో కంప్లీట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పట్లో వైష్ణవ్ దొరకడం కష్టం. అయితే సాయి ధరమ్ తేజ్ మొహమాటస్తుడు. పైగా జాలి ఎక్కువ. సంతోష్ తన టాలెంట్ కనుక ఉపయోగిస్తే సాయి ధరమ్ తేజ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు