తెలుగు సినీ ప్రేక్షకులకు నటి రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. “జేమ్స్ పాండు” అనే తమిళ సినిమాలో పార్థిబన్ పక్కన హీరోయిన్ గా 2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తరువాత బద్రి సినిమాతో తెలుగు తెరపై తలుక్కుమంది. ఈ ఒక్క మూవీతోనే తెగ పాపులర్ అయిపోయిన రేణు దేశాయ్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లాడింది. ఇక 2003లో జానీ సినిమా తర్వాత ఈమె సినిమాల్లో కనిపించలేదు. 2012లో పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత పిల్లల బాధ్యతలో ఇంటికే పరిమితమైంది. పిల్లల కోసం ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Read More:Renu Desai Inst Post: ఒక్కొక్కరు కనీసం రూ.100 అయినా ఇవ్వండి..
మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో సామాజికవేత్త హేమలత లవణం పాత్ర ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది రేణు దేశాయ్. ఇక ఈమె సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ సందర్భంలో రేణు దేశాయ్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అదేంటంటే.. ” లాక్ డౌన్ సమయంలో నాకు హెల్త్ సమస్యలు వచ్చాయి.
Read More:Renu Desai Comments: వరుణ్-లావణ్యల పెళ్లికి రేణు దేశాయ్ బిగ్ ట్విస్ట్?