ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న రిలీజ్ అవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ లను ఓపెన్ చేయగా, బి- టౌన్ లో ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.
ఆదిపురుష్ సినిమాని వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. దాదాపు 700 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇటీవలనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి లో ప్రి రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించగా, దాదాపు లక్ష మందికి పైగా ప్రభాస్ అభిమానులు హాజరై రికార్డ్ సృష్టించారు, అలాగే ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రతిష్టాత్మకమైన ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించడానికి సెలెక్ట్ అయ్యి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. వీటితో పాటుగా అడ్వాన్స్ బుకింగ్స్ లోను ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ని ఆదివారం రోజున ఓపెన్ చేయగా, అతితక్కువ సమయంలోనే ఈ ఆదిపురుష్ హిందీ వెర్షన్ కి గాను దాదాపు1.50 సిఆర్ కి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయట. అంతేకాదు ఈ బుకింగ్స్ ఇంకా ఆగకుండా కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయట. బాలీవుడ్ లో స్టార్ హీరో లకు మాత్రమే ఇలా జరుగుతుండగా, ప్రభాస్ బాలీవుడ్ స్టార్ కానప్పటికీ ఈ రేంజ్ బుకింగ్స్ అవుతుండటంతో అందరు ఆశ్చర్య పోతున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News