అక్కినేని ఫ్యామిలీ అంత కలిసి నటించిన మనం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రాశి ఖన్నా , ఊహలు గుస గుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రభావతి క్యారెక్టర్ లో రాశి ఖన్నా నటన అందరిని బాగా ఆకట్టుకుంది.
అయితే రాశి ఖన్నా అందరి హీరోయిన్స్ లాగ గ్లామర్ క్వీన్ కాదు. అందం, అణకువతో ఉండే మంచి పాత్రలనైతే ఆమె ఎంచుకుంటుంది. అందుకే ఆమె చేసిన అన్ని సినిమాల్లో గ్లామర్ షో ఎక్కువగా కనిపించదు. అయితే ఈ ధోరణి మొదట్లో బాగానే ఉన్న, ఈ మధ్య ఈ కారణంగానే అవకాశాలు బాగా తగ్గడంతో రాశి ఖన్నా కూడా గ్లామర్ షో చేయడానికి రెడీ అయింది. మొదట్లో రొమాంటిక్ సీన్స్ చేయడానికి అస్సలు ఇష్టపడని రాశి ఖన్నా ఇప్పుడు వాటికి కూడా యస్ చెప్పుతుంది. గతంలో ఆమె విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో రొమాంటిక్ సీన్ ల సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. రాశి ఖన్నా ఇలాంటి సీన్స్ కి యస్ చెప్పడం ఏంటి అని అందరు ఒకింత షాక్ అయ్యారు. కానీ ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఇక అలాంటి పాత్రలు ఇంకా చేయను అని ఆ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.
ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగులో కంటే కూడా హిందీ, తమిళ్ సినిమాలలో బిజీ గా ఉంది. ఇటీవలనే ఆమె అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఫర్జి అనే వెబ్ సిరీస్ లో నటించింది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సిరీస్ మంచి హిట్ అయింది. అలాగే షాహిద్ కపూర్ తో కూడా రాశి ఖన్నా బాగా క్లోజ్ అయిందని టాక్. తరుచుగా వీళ్లిద్దరు కలుస్తున్నరంట కూడా. అయితే రాశి ఖన్నా తన ఇంస్టాగ్రామ్ లో నిన్న రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చి అలాగే తన డే ఎలా గడిచిందో ఒక చిన్న వీడియో ద్వారా వ్యక్తపరిచింది. అయితే ఆ వీడియోని చుసిన అందరు, అది తీసింది షాహిదే అంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం రాశి ఖన్నా హిందీ యోధా సినిమాలో నటిస్తుంది. సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ అవబోతుంది
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News