బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్లలో నటి పరిణితి చోప్రా ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె సెప్టెంబర్ 24వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడైన ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దాను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. వీరి వివాహం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ బ్యూటీ సినిమాల కన్నా ఇతర విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
దీంతో ఈమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినాప్పటికీ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక పెళ్లి తర్వాత కూడా పరిణితి చోప్రా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాఘవ్ తో పెళ్లి తర్వాత ఈమె హనీమూన్ ని గ్రాండ్ గా చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈమె భర్త లేకుండానే మాల్దీవ్స్ కి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది. గతంలో ఇలాగే ఈమె హనీమూన్ కి వెళ్ళినట్లు వార్త వైరల్ అయింది.
కానీ ఆ తర్వాత తాను హనీమూన్ కి వెళ్లలేదని.. ఆ ఫోటోలు తన మరదలు తీసిందని చెప్పుకొచ్చింది. “ఇది గర్ల్ ట్రిప్” అంటూ బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కానీ ఇప్పుడు మరోసారి తన అమ్మ, అత్తయ్యలతో బీచ్ లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భర్తతో కాకుండా వీళ్ళతో హనీమూన్ ఎంజాయ్ చేయడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.