Tollywood : ఇప్పుడు కన్నడ స్టార్లు

టాలీవుడ్ ప్రస్తుతం ఎలా ఉందో ప్రతేకంగా చెప్పాల్సిన పని లేదు. కొద్ది రోజుల క్రితం చిన్న సినీ పరిశ్రమగా ఉండేది. కానీ, తెలుగు దర్శక నిర్మాతలు అద్భుతమైన సినిమాలను తెరకెక్కించడంతో ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ కు మంచి గుర్తింపు వచ్చింది. దీని తర్వాత కూడా బాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా, టాలీవుడ్ నుండి సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా స్టైల్ మార్చుకున్నారు. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అని తేడా లేకుండా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్తున్నారు. దీంతో కొన్ని సార్లు అగ్ర హీరోల సినిమాలు కూడా ప్లాప్ అవుతున్నాయి. చిన్న హీరోల సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.

దీంతో ఇతర పరిశ్రమల హీరోల కళ్లు తెలుగు చిత్ర పరిశ్రమపై పడ్డాయి. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే మంచి కంటెంట్ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. అలా డబ్ చేసిన సినిమాలకు కూడా మంచి ఫలితాలు వచ్చాయి. ముందుగా కోలీవుడ్ నుండి కమల్ హాసన్, రజినీ కాంత్ లాంటి అగ్ర హీరోలు మాత్రమే తమ సినిమాలను తెలుగులోకి డబ్ చేసేవారు. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా తెలుగులో డబ్ చేస్తున్నారు.

ఇక శాండిల్ వుడ్ నుండి అయితే, తెలుగు ప్రేక్షకులకు ఉపెంద్ర మినహా ఏ హీరో పేరు పెద్ద గా తెలియదు. కానీ, కేజీఎఫ్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్ కు తెలుగు ప్రేక్షకులు చూపించిన అభిమానం అంతా ఇంత కాదు. దీన్ని చూసి, మిగతా కన్నడ హీరోలు కూడా తమ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈగ సినిమాతో కిచ్చా సుదీప్, అతడే శ్రీమన్నారయణ సినిమాతో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ, పెద్దగా పేరు తెచ్చుకోలేదు. కానీ, కేజీఎఫ్ హిట్ చూసిన తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

- Advertisement -

రక్షిత్ శెట్టి ఇటీవల చార్లీ 777 సినిమాతో మరో సారి వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. తాజాగా విక్రాంత్ రోణ అనే సినిమాతో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రాంత్ రోణ రేపు కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ప్రమోషన్స్ లలో టాలీవుడ్ నుండి రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, నాగార్జున, అఖిల్ పాల్గొన్నారు. తెలుగులో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, శాండిల్ వుడ్ నుండి మరి కొందరు హీరోలు టాలీవుడ్ కు వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు