Tollywood: సౌత్ ఇండియా లో నెంబర్ వన్ గా నేషనల్ క్రష్

రష్మిక మందన్న… సౌత్ ఇండియా లో ఇప్పుడు ఒక సెన్సేషన్. ఛలో సినిమాతో తెలుగులో పరిచయమయ్యి మొదటి సినిమా తోనే మంచి హిట్ కొట్టి వరుస ఆఫర్లు దక్కించుకుంది. గీతా గోవిందం సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న రష్మిక ఆ సినిమా తోనే  టాలీవుడ్ కి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ సినిమా తో మరో సూపర్ హిట్ కొట్టగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి నేషనల్ క్రష్ గా మారిపోయింది.

అయితే వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎప్పుడు సందడి చేసే ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఇంస్టాగ్రమ్ లో ఎక్కడికెళ్లినా స్టేటస్ లేదా రీల్స్ పెడుతూ ఉంటుంది. తాజాగా రష్మిక ఓ రికార్డు ని సాధించింది. ఇన్స్టా గ్రామ్ లో రష్మిక మందన్న 38 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అంతే కాదు సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్ గా మొదటి స్థానం లో నిలిచింది. ఇక 26 మిలియన్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో సమంత ఉంది.

ముందుముందు నార్త్ లో కూడా ఫాలోవర్స్ ని దక్కించుకుంటే ఇండియా వైడ్ గా మరింత టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా తో బిజీగా ఉండగా నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఇంకా కన్నడలో రెయిన్ బో మరో రెండు సినిమాలు చేస్తుంది.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు