టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పటివరకు చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ నందమూరి నటసింహం బాలయ్య తనయుడు మోక్షాజ్ఞ మాత్రం రావడం లేదు. ఇప్పటికే బాలయ్య బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. ఇదే సమయంలో తన కొడుకు కూడా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. బాలకృష్ణ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా నందమూరి వారసుడు మోక్షాజ్ఞ లుక్ చూసి ఆయన సినీ ఎంట్రీ ఫిక్స్ అయిందని.. కెమెరా ముందుకు రావడానికి బాలకృష్ణ వారసత్వం సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మోక్షాజ్ఞ పేరు తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మోక్షజ్ఞ ఎంట్రీ చాలా గ్రాండ్గా ఉండాలని బాలయ్య భావిస్తున్నట్టు సమాచారం. ఈతరం ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేవిధంగా మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండాలని బాలయ్య డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. తన కొడుకు కచ్చితంగా సినిమాల్లోకి అయితే వస్తాడని గతంలో బాలయ్య పలు ఇంటర్వ్యూల్లో బాలయ్య తెలిపారు. ఆదిత్య 369 తరహా సబ్జెక్ట్తో మోక్షజ్ఞ కోసం స్వయంగా బాలయ్యనే దర్శకుడిగా మారే అవకాశం కనిపిస్తోందని వార్తలు వినిపించాయి.
తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ వేదికగా కుమారుడు ఎంట్రీపై ఓ హింట్ అయితే ఇచ్చేసారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలతో తన కొడుకు సినిమాతో సినిమా చేసి అతడిని వెండి తెరకు పరిచయం చేసేది వచ్చే ఏడాదే అని తెలుస్తోంది. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ మూడో ఎపిసోడ్లో శర్వానంద్, అడవిశేష్లు గెస్ట్లు విచ్చేశారు. వారితో బాలయ్య తెగ సందడి చేశారు.
శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘ఆదిత్య 369’ సినిమా గుర్తుకొచ్చిందని బాలయ్య చెప్పారు. అంతేకాదు.. తాను రాసిన ‘ఆదిత్య 999’ మాగ్జీమమ్ వచ్చే ఏడాది తీసుకొస్తున్నట్టు తెలిపారు. బాలయ్యనే స్వయంగా కొడుకు సినిమా కోసం స్టోరీ సిద్దం చేసి.. దర్శకుడిగా మారుతున్నట్టు ఈ మాటలను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి బాలయ్య మెగా ఫోన్ పట్టనున్నట్టు తెలుస్తోంది.