మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం విధితమే. ఇటీవలే విడుదలైన ఆచార్య కాస్త నిరాశ పరిచినప్పటికీ.. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళాశంకర్, మెగా 154 చిత్రాల షూటింగ్స్ తో తీరిక లేకుండా గడిపేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లో పలువురు స్టార్స్ నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ కనిపించనుండగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154లో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మెగా అభిమానులకు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మెగా 154 చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
యాక్షన్ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సముద్ర ఖని, బాబీ సింహా, కేథరిన్ వంటి నటీ, నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.