కోలీవుడ్ స్టార్ హీరో విజయ్-టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం వరిసు. అయితే చిత్రం షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తికానున్నట్టు సమాచారం. ఈ సినిమాపై సౌత్ అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ విషయం పై అప్డేట్ అందింది.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.120 కోట్ల వరకు రాబట్టింది. డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో రూ.60కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్ హక్కులను సన్నెట్ వర్క్ కి దాదాపు రూ.50కోట్లకు విక్రయించినట్టు సమాచారం. ఇక ఆడియో రైట్స్ సుమారు రూ.10కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. విజయ్-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు, శిరీష్, పరమ్ వీ పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రభు, యోగిబాబు, ప్రకాశ్ రాజు, శ్రీకాంత్, జయసుధ కీలక పాత్రలు పోషించనున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.