Manchu Vishnu : హర్రర్ స్టోరీతో..

టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తాజాగా జిన్నా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు, ఈ జిన్నా చిత్రంపై భారీగా అంచనాలను పెట్టుకున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఇషాన్ సూర్య డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. కాగా ఈ చిత్రానికి కథ, స్క్రిన్ ప్లే ను కోన వెంకట్ అందిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న ఈ సినిమాను ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు నిర్మింస్తున్నారు.

జిన్నా సినిమాలో గాలి నాగేశ్వర రావు అనే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపిస్తున్నారు. అలాగే ఈయనకు జోడీగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ తో జిన్నా సినిమాలో టెంట్ హౌస్ ఓనర్ పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే జిన్నా లవర్ పాత్రలో పాయల్ రాజ్ పుత్ కనిపిస్తుంది. దీంతో పాటు సన్నీ లియోన్ విదేశీ భామ పాత్ర చేస్తున్నట్లు అర్థమవుతుంది.

అలాగే ఈ చిత్రం హర్రర్ నేపథ్యంలో రాబోతుందని టీజర్ కన్ఫామ్ అయింది. టెంట్ హౌస్ ఓనర్ గా ఉన్న జిన్నా జీవితంలోకి సన్నీ లియోన్ రావడంతో కొన్ని మార్పులు జరుగుతున్నట్లు అర్థమవుతుంది. అలాగే సన్నీ కి దయ్యం పట్టిన సందర్భాల్లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు