టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం లైగర్. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ఫైనల్ గా ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, నటుడు సునీల్ శెట్టితో పాటు అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే లైగర్ నుండి ఇప్పటి వరకు వచ్చిన పాటలు, పోస్టర్లు, ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు లైగర్ టీం చేస్తున్న ప్రమోషన్స్ సినిమా అంచనాలను రోజు రోజుకు పెంచుతున్నాయి.
సెన్సార్ ప్రక్రియను లైగర్ గురువారం పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇది ఇలా ఉండగా, తాజా గా లైగర్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రత్యేక ఎమోజీని లైగర్ కు ట్విట్టర్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలకు మాత్రమే స్పెషల్ ఎమోజీని ట్విట్టర్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా లైగర్ కు ఎమోజీ వచ్చింది.
గతంలో పాన్ ఇండియా స్టార్ నటించిన సాహో సినిమాకు, రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన కేజీఎప్2 తో పాటు ఇటీవల వచ్చిన సర్కారు వారి పాటకు మాత్రమే స్పెషల్ ఎమోజీలు వచ్చాయి. లైగర్ కు ప్రత్యేక ఎమోజీ రావడంతో లైగర్ కు ఉన్న క్రేజ్ మరోసారి దేశానికి తెలిసింది. కాగ తమ చిత్రానికి ఎమోజీ క్రియేట్ చేసినందుకు ట్విట్టర్ కు లైగర్ టీం ధన్యవాదాలు తెలిపింది.
Dear TWITTER FAM 🙌
Here’s the surprise for you all ❤️Hashtag Emojis are LIVE NOW!#LIGER#WaatLagaDenge#LigerHuntBegins
Let the madness knockout the timelines🤘@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies pic.twitter.com/j9zcDIL3DP
— Puri Connects (@PuriConnects) August 18, 2022