విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రంలో ఉండటం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైక్ టైసన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. అతను అతిధి పాత్రలోనే నటించినప్పటికీ, ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
లైగర్ చిత్రం కోసం మైక్ టైసన్ కు ఏకంగా 25 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది మైక్ టైసన్ యొక్క మొదటి టాలీవుడ్ చిత్రం. అయితే మైక్ టైసన్ ఉన్నా కూడా సినిమాను ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా విజయ్ దేవరకొండకు పెద్ద ఫెయిల్యూర్ గా మారుతోంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 90 శాతం షోలు రద్దయ్యాయి. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన విజయ్ దేవరకొండకు వరుసగా ఇది మూడో చిత్రం. ప్రమోషన్ని పెద్దఎత్తున చేసినా సినిమా మాత్రం ఆకట్టుకోలేదు.
‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ (MMA) ఛాంపియన్గా మారడానికి హీరో చేసే ప్రయత్నాల గురించి ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు పూరిజగన్నాథ్. విజయ్ కు జంటగా అనన్య పాండే నటించింది.