Aadi : కామెడీ ఎంటర్ టైనర్ గా క్రేజీ ఫెలో

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న తాజా సినిమా క్రేజీ ఫెలో. ఆది నటించిన తీస్ మార్ ఖాన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ క్రేజీ ఫెలో అనే సినిమాతో ఆది సాయి కుమార్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కాగా ఈ సినిమా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తుంది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ లో కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ నటిస్తున్నారు.

ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడుదలైంది. ‘క్రేజీ ఫెలో’ టైటిల్ కి తగ్గట్టే టీజర్ లో హీరో ఆది పాత్ర చాలా క్రేజీగా ఉంది. ఈ సినిమాలో జీవితాన్ని సంతోషంగా గడిపే వ్యక్తిగా ఆది కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ట్రైలర్ లో సాయి కుమార్ వాయిస్ ఓవర్ హైలైట్ గా ఉంది. “సినిమా స్టైల్ లో ఒక పంచ్ లైన్ లో మనోడి గురించి చెప్పాలి అంటే.. మందు తాగితే లివర్ పోతుంది. సిగరెట్ తాగితే లంగ్స్ పోతాయి. వీడితో ఉంటే దూల తీరిపోతుంది” అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్ ఆది క్యారెక్టర్ ను తెలిపేలా ఉంది. “అలాగే పులితో పరుగు పందెం.. నాతో మందు పందెం వేయకూడదు” అంటూ ఆది చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

అలాగే టీజర్ లో ఆది స్టైలిష్, డైనమిక్ లుక్‌తో పాటు కామిక్ టైమింగ్ ఎక్సటార్డినరీగా ఉంది. సతీష్ ముత్యాల కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఆర్ఆర్ ధృవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే చిత్ర బృందం దూకుడుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు