Kiara-Sidharth : ఈ సారి అయినా జరుగుతుందా ?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వాణి టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కేవలం ఈమె నటనతోనే కాకుండా గ్లామర్ షోతో కూడా ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “భరత్ అనే నేను” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వినయ విధేయ రామ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది కియారా అద్వానీ.

అయితే చాలా కాలంగా కియారా అద్వాణి, సిద్ధార్థ మల్హోత్రా ప్రేమించుకుంటున్నారని.. పెళ్లికి కూడా సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. “షేర్షా” చిత్రంలో ఈ జంట కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవల వీరి వివాహం డిసెంబర్ లో ఘనంగా జరగనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఈ బాలీవుడ్ ప్రేమ జంట వివాహ వేదిక అన్వేషణలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత గోవాలోని ప్రముఖ రిసార్ట్ లో పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రదేశంలో వివాహం చేసుకుంటే బాగుంటుందని ఆలోచనలో చివరకు చండీఘర్ ను ఖరారు చేశారని పేర్కొంటున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ లో పెళ్లికి ముహూర్తం కూడా ఖరారు అయిందని చెబుతున్నారు. మరి ఈ వార్తలపై ఈ బాలీవుడ్ జంట ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు