Karthikeya-2: 100 కోట్ల క్లబ్ లో

విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ 2. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. చందు మొండేటీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 8 ఏళ్ల కిందట సూపర్ హిట్ అందుకున్న ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘కార్తికేయ 2’ ట్రైలర్ తోనే పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుని మొదటి ఆట నుంచే అదరగొడుతుంది. మొదట్లో చాలా పరిమిత థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్యాకెడ్ హౌస్ లతో వావ్ అనిపిస్తోంది. తెలుగులో ఇరగదీస్తున్న ఈ సినిమా హిందీ రాష్ట్రాల్లో కూడా ఇరగదీస్తోంది. మొదట 50 స్క్రీన్స్ తో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు మూడు వేలకు పైగా స్క్రీన్స్ తో వావ్ అనిపిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తుంది.

ఈ చిత్రం హిందీలో 15 కోట్ల మార్క్ ను దాటింది. మరియు ఈరోజు ఆక్యుపెన్సి కూడా బాగానే ఉంది. మరియు ట్రేడ్ ఈరోజు కూడా మంచి నంబర్లను ఆశిస్తుంది. తిరిగి తెలుగులో కూడా ఈ సినిమా 35 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటివరకు 75 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. 100 కోట్ల రూపాయల క్లబ్ వైపుకి దూసుకుపోతుంది. అయితే ఆగస్టు 25న లైగర్ విడుదల కానుండగా, ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు