తమిళ నటుడు కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభంలో ఎలాంటి అంచనాలు లేకుండా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తరువాత మాస్ ఆడియన్స్ ని బీభత్సంగా ఆకట్టుకుంది. ఖైదీ సినిమా తెలుగు, తమిళం రెండింటిలో సూపర్ హిట్ అయింది. ఖైదీ2లో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కార్తీ పొన్నియిన్ సెల్వన్ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ప్రమోషన్స్లో ఖైదీ 2 సినిమా గురించి కూడా ప్రస్తావించాడు.
లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 స్క్రిప్ట్ సిద్ధం చేశాడని, ఆయన ప్రస్తుతం వేరే సినిమా చేస్తున్నాడని ఆ చిత్రం పూర్తవ్వగానే 2023లో ప్రారంభంలో మా సినిమా మొదలవుతుందని వెల్లడించారు కార్తీ. లోకేష్ కనగరాజ్ ఇటీవల కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దళపతితో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఖైదీ 2 సినిమా చేయనున్నారు.
తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు లోకేష్ కనగరాజ్. తెలుగులో తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయాలనుకుంటున్నారట. ఇటీవల తెలుగులో విడుదలయ్యే సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతుండడంతో నేరుగా తెలుగు సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తే క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.