Kangana Ranaut : ఇన్ స్టాగ్రామ్ ఎందుకూ పనికిరాదు

బాలీవుడ్ నటి కంగనా రానౌత్ కు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితం అయింది. ఇక అక్కడ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ.. ఆ జానర్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ భామ ఎప్పుడు ఎదో ఒక అంశంతో ట్రెండింగ్ లో ఉంటుంది.

ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ లో బ్లూటిక్ పై స్పందించిన కంగనా .. తాజాగా ఫోటో షేరింగ్ యాప్ ఇంస్టాగ్రామ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్స్టాగ్రామ్ కేవలం ఫోటోలు షేర్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుందని.. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఉండదని చెప్పింది. ఎవరైనా ఏదైనా అభిప్రాయం రాసిన అది మరుసటి రోజుకు అదృశ్యం అవుతుందని చెప్పుకొచ్చింది.

ఆలోచనలను వెల్లడించేందుకు ఇది బ్లాగ్ లాగా పనిచేయాలని సూచించింది కంగనా. ఏదైనా అభిప్రాయం స్టోరీలో రాస్తే అది మరునాడే అదృశ్యం కావడంపై ఆమె పెదవి విరిచింది. ఇక కంగనా రానౌత్ ట్విట్టర్ నిబంధనలను పదేపదే అతిక్రమిస్తున్నారంటూ 2021 మే లో ఆమె అకౌంట్ ను శాశ్వతంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఎలన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత కంగనా అకౌంట్ ను పునరుద్ధరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు