Janhvi Kapoor : ‘అమ్మ వద్దని చెప్పింది’

భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. సినీ ప్రేక్షకులకు శ్రీ దేవి అందించిన మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ తరగనివి. 54 ఏళ్ల వయసులోనే ఈ అతిలోకసుందరి అనంత లోకాలకు వెళ్లిపోయింది. దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఇతర భాషల్లోనూ జాన్వీతో సినిమా చేయించాలని చాలా మంది దర్శకులు క్యూ కడుతున్నారు. అంతటి అందం, అభినయం సొంతం చేసుకుంది. తల్లికి తగ్గ కూతురిగా ముద్ర వేసుకుంటోంది. “ధడక్” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ “కోలమావు కోకిల” చిత్రానికి హిందీ రీమేక్ గా “గుడ్ లక్ జెర్రీ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో నయనతార పోషించిన పాత్రలో జాన్వి నటించి, మెప్పించింది. అయితే తాజాగా జాన్వి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయింది. “అమ్మ ముఖం చూడకుండా నా రోజువారి పనులు ప్రారంభించేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు అమ్మ లేకుండా జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టంగా ఉంది. ఇండస్ట్రిలోకి వస్తానంటే మొదట్లో అమ్మ వద్దంది. ఇండస్ట్రీలో అనుకున్నంత ఈజీగా ఏదీ ఉండదని చెప్పింది. నెగ్గుకురావాలంటే కఠినంగా ఉండాలని , అలా నేను ఉండలేనని చెప్పింది. కాని ఏది ఏమైనా నేను నటిగా కొనసాగాలనుకుంటున్నానని తేల్చి చెప్పడంతో ఒప్పుకుంది. ” అంటూ జాన్వి చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు