Janhvi Kapoor : ఆ నిర్మాత వల్లే నా పై ట్రోల్స్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తక్కువ సినిమాలు చేసినా, కావాల్సినంత ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలనాటి నటి శ్రీదేవి, బోనీ కపూర్ ల కూతురుగా ఇండస్ట్రీకి వచ్చింది జాన్వీ. ధడక్ అనే సినిమాలో నటించి కమర్షియల్ హిట్ ను కూడా కొట్టింది. దీని తర్వాత సినిమాలు చేసింది విజయాలను, అపజయాలను అందుకుంది. కానీ జాన్వీ కపూర్ ఒక బాలీవుడ్ స్టార్ కిడ్ అనే పేరు మాత్రం తొలగించుకోలేకపోయింది.

అంతే కాదు.. ఈ భామపై ఎప్పుడు ఎదో ఒక రకంగా ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఈమె సినిమా వల్ల కంటే ట్రోల్స్ వల్లే ఎక్కువ సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ పై జాన్వీ కపూర్ స్పందించింది. తనపై వస్తున్న ట్రోల్స్ ను చూసి మొదట్లో బాధపడేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశాను అని తెలిపింది.

అలాగే “నా పై వచ్చిన ట్రోల్స్ కు కారణం నేను కాదు.. కరణ్ జోహర్ వల్లే నాకు ఇలాంటి ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే నన్ను ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం చేసింది అయనే. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లోనే ధడక్ చిత్రం వచ్చింది. ఈ కారణంతోనే నా పై ట్రోల్స్ వస్తున్నాయి. కానీ ధర్మ ప్రొడక్షన్ లో నేను సినిమా చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. కరణ్ జోహర్ నా పై చూపించే విశ్వాసం, ప్రేమను మర్చిపోలేను” అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. కాగా బాలీవుడ్ అగ్ర హీరోల కిడ్స్ తో మాత్రమే కరణ్ జోహర్ సినిమాలు చేస్తారని, బ్యాగ్రౌండ్ లేని నటీ నటులను పట్టించుకోడని ఒక ట్యాగ్ కరణ్ జోహర్ కు ఉన్న సంగతి విధితమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు