Janhvi Kapoor : అబ్బాయిలతో మాట్లాడతానేమో అని అమ్మ భయపడేది

అతిలోక సుందరి, లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా జాన్వీ బీ టౌన్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను పొందింది. మరాఠీ చిత్రం సైరాట్ మూవీని హిందీలో రీమేక్ గా వచ్చిన ధడక్ చిత్రంతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. 2018 లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత చక్కటి అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

తాజాగా చెన్నైలో తన తల్లి శ్రీదేవి నివాసాన్ని అభిమానులకు పరిచయం చేసింది జాన్వీ కపూర్. ఇందుకు సంబంధించి హోమ్ టూర్ వీడియోని విడుదల చేసింది. హోమ్ టూర్ లో భాగంగా ఆ ఇంటి జ్ఞాపకాలను పంచుకుంది. శ్రీదేవి నటిగా తన కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో చెన్నైలోనే ఎక్కువగా గడిపేవారు. ఆ సమయంలో చెన్నైలో ఆమె ఓ ఇల్లును కూడా కొనుగోలు చేశారు. ఆ ఇంటినే జాన్వీ హోమ్ టూర్ చేసింది. ఈ వీడియోలో శ్రీదేవి, బోనీ కపూర్ కు సంబంధించిన పలు అరుదైన చిత్రాలను చూపించింది.

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. హోమ్ టూర్ సందర్భంగా జాన్వికాపూర్ మాట్లాడుతూ.. ” ఈ ఇంట్లోని నా గది బాత్రూంకు లాక్ ఉండదు. లాక్ పెట్టేందుకు అమ్మ అంగీకరించకపోవడం నాకు గుర్తుంది. బాత్రూంలోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్ లో మాట్లాడతానేమో అన్న భయం అమ్మలో ఉండేది. అందుకే నా బాత్రూం డోర్ కు లోపలి వైపు గడియ పెట్టేందుకు అమ్మ అనుమతించలేదు. ఇప్పుడు ఈ గదులన్నీ కొత్తదనం సంతరించుకున్నప్పటికీ నా బాత్రూంకు మాత్రం లాక్ ఉండదు” అని జాన్వీ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు