Jailer -2: జైలర్ -2 సినిమాపై అదిరిపోయే అప్డేట్..!!

Jailer -2: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ జైలర్.. ఈ సినిమా విడుదల వరకు సరైన విజయం లేక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్ కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. 2023 ఆగస్టులో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టి రికార్డు క్రియేట్ చేసింది.. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Jailer -2: A Big update on jailer -2..!
Jailer -2: A Big update on jailer -2..!

జైలర్ -2 పై అప్డేట్..
జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు . తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ పనులను కూడా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రారంభించినట్లు సమాచారం. హుకుమ్ అనే పేరుతో పార్ట్ -2 పనులను ఇప్పటికే మొదలు పెట్టేసారట. ఈ జూన్లో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారని సమాచారం.. ఇక ఈ వార్త కాస్త బయట తెలియడంతో అభిమానులు #Jailer -2, #Hukum హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో జైలర్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారని చెప్పవచ్చు.

జైలర్ నటీనటులు..
ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ,మలయాళ నటుడు మోహన్ లాల్ , బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక వీరే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పవచ్చు.. వీరితోపాటు రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ , మిర్నా మేనన్, యోగి బాబు తదితరులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ హీరోయిజానికి అభిమానులు ఫిదా అయితే వర్మన్ గా వినాయకన్ కూడా అదే రేంజ్ లో ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. మొత్తానికి జైలర్ సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రజినీకాంత్ హుకుమ్ సినిమాతో మరెలా అలరిస్తారో చూడాలి.

- Advertisement -

రజనీకాంత్ సినిమాలు..
ఇకపోతే జైలర్ సినిమా తర్వాత ఈయన తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలాం సినిమాలో గెస్ట్ పాత్రలో పోషించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. కేవలం రజనీకాంత్ వల్లే ఈ సినిమా కొంతవరకు పాజిటివ్ బజ్ తెచ్చుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి . ఇదిలా ఉండగా మరోవైపు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు రజినీకాంత్.. దర్శకుడు లోకేష్ కనగరాజు కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.. మరొకవైపు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ చిత్రాన్ని కూడా రజనీకాంత్ తెరకెక్కిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు