Prabhas: ఇట్స్ అఫిషియల్… “ప్రాజెక్ట్ K” లో లోకనాయకుడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ విడుదలైన తర్వాత గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ తన రెండు సినిమాల షూటింగుల్లోనూ ఒకేసారి పాల్గొంటూ బిజీ గా ఉన్నాడు. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ కాగా, మరొకటి నాగ్ అశ్విన్ తీస్తున్న “ప్రాజెక్ట్ కే”. సలార్ సినిమా ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రాజెక్ట్ కే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే, హీరోయిన్ గా నటిస్తున్నారు. దిశా పటాని మరో కీలక పాత్రలో నటిస్తుంది.

అయితే ప్రాజెక్ట్ కే లో కీలకమైన పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడని తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుండి లీక్ అయిన అమితాబ్ లుక్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఆ లుక్స్ లీక్ అయినప్పటి నుండి ఫ్యాన్స్ లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక తాజాగా ప్రాజెక్ట్ కే లో మరో లెజెండరీ హీరో భాగం అయ్యాడని మేకర్స్ అఫిషియల్ గా కంఫర్మ్ చేసారు. ఆ హీరో మరెవరో కాదు విశ్వ నటుడు కమల్ హాసన్. ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలకమైన పాత్ర చేస్తున్నాడని చిత్ర యూనిట్ ఒక అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేస్తూ కంఫర్మ్ చేసింది. ఈ ప్రకటనతో ప్రాజెక్ట్ కే పై అంచనాలు తారా స్థాయికి చేరాయి.

- Advertisement -

ఇక కమల్ హాసన్ రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ తెలుగులో నటిస్తుండడం విశేషం. ఈ అనౌన్స్ మెంట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నా ఒక రకంగా డల్ గాను ఉన్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ కే రిలీజ్ సినిమా అవ్వాలంటే దాదాపు ఏడాదికి పైగానే సమయం పడుతుంది. ఈ లోపు ప్రభాస్ సలార్ షూటింగ్ ఫినిష్ చేస్తాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాకే ప్రాజెక్ట్ కే పై పూర్తిగా దృష్టి సారిస్తాడు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు