Tollywood : సంక్రాంతి బరిలో జగన్ హీరోలు ?

2023 సంక్రాంతి ఓ రకంగా సినిమాల పండుగ అని కూడా చెప్పొచ్చు. ఈ సీజన్ కు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆ కిక్కే వేరు. 2022 సంక్రాంతి కరోనా మహమ్మారి వల్ల చాలా డల్ గా ముగిసింది. కానీ, 2023 సంక్రాంతి మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుంది. ఇప్పటికే కొన్నిపెద్ద సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయి. మరికొన్ని స్లాట్ బుక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో ముందుగా ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత విజయ్, వైష్ణవ్ తేజ్ ల సినిమాలు కూడా రేసులో నిలిచాయి. చిరంజీవి-బాబీ కాంబినేషన్ లోని మెగా154 కూడా సంక్రాంతికే రాబోతుంది.

వీటితోనే బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఏర్పడటం ఖాయమని అంతా అనుకుంటున్న టైంలో, మహేష్ బాబు కూడా ఈ రేసులో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు రివీల్ చేశారు. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 2023 సంక్రాంతి కానుకగానే రిలీజ్ అవుతుందని సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే టైం లో అధికారిక ప్రకటన వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ మధ్యనే జగన్ వద్దకు వెళ్లొచ్చిన హీరోలు 2023 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో పోటీపడనున్నారా ? అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి టైంలో ప్రభాస్, మహేష్ లను వెంటేసుకుని చిరు టికెట్ రేట్ల ఇష్యూ పై జగన్ ను కలిసొచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, జగన్ ను కలిసిన హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇటీవల ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్, ఆచార్యతో చిరంజీవికి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే, మహేష్ ఒక్కడే సర్కారు వారి పాటతో ఈ ట్రోల్స్ నుండి కొంత వరకు తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరోలు సంక్రాంతి బరిలో నిలిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఎలాంటి ట్రోల్స్ వస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు