Telugu Actor: ఆ హీరో పెళ్లి ఆగిపోయిందా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. యూఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షిత రెడ్డితో శర్వానంద్ కి నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో శర్వానంద్ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత రెడ్డి మరెవరో కాదు.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెనే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు కూడా. గోపాల కృష్ణారెడ్డి అల్లుడు గంగారెడ్డికి రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి స్వయానా సోదరుడు. కాబట్టి గోపాలకృష్ణారెడ్డికి రక్షిత రెడ్డి మనవరాలు అవుతారు. రక్షిత యూఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నడంతో శర్వానంద్ పెళ్లి గురించి అప్పట్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది. అయితే ఈ నిశ్చితార్థం జరిగి నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ పెళ్లి ప్రస్తావన ఎక్కడా లేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరైతే ఏకంగా వీరి పెళ్లి రద్దు అయిందని ప్రచారం చేస్తున్నారు.

కానీ అసలు విషయం ఏంటంటే.. శర్వానంద్ పెళ్లి రద్దు కాలేదు. గత కొంతకాలంగా శర్వానంద్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, అంతేకాకుండా శర్వానంద్ జాతకానికి తగ్గట్టుగా ముహూర్తాలు అనుకూలించకపోవడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు