Hamsa Nandini: క్యాన్సర్ ని జయించింది

హంస నందిని.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. టాలీవుడ్ ఐటెం బాంబ్ గా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాలలో తన టాలెంట్ ని నిరూపించుకుంది. హంస నందిని చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరును సంపాదించుకుంది. 2017లో ఒక్కటవుదాం సినిమాతో వెండితెరకు పరిచయమైన హంస నందిని ఆ తరువాత వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అనుమానాస్పదం చిత్రంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మ కి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ప్రభాస్ మిర్చి. ఈ చిత్రంలో “మిర్చి మిర్చి” అంటూ స్పెషల్ సాంగ్ లో దుమ్మురేపిన ఈ భామ ఆ తరువాత వరుస ఆఫర్లు అందుకుంది. కానీ 2021లో అభిమానులకు షాక్ ఇచ్చే వార్తని చెప్పింది.

ఇంస్టాగ్రామ్ వేదికగా తాను క్యాన్సర్ పై పోరాటం చేస్తున్నారని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేసింది. అయితే 19 ఏళ్ల క్రితం తన తల్లి కూడా క్యాన్సర్ తోనే కన్నుమూశారని.. నాటినుండి అదే భయంతో జీవిస్తున్నానని తెలిపింది. చెప్పినట్లుగానే ఏడాదిన్నర పాటు ప్రాణాంతక వ్యాధితో పోరాడి ఈమధ్య కోలుకొని మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ క్రమంలోనే క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకొని బయట ప్రపంచంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్న హంస నందిని తన సంతోషాన్ని ఓ పోస్ట్ రూపంలో తెలియజేసింది. తన అభిమానులకు, ఫాలోవర్స్ కి ఒక సింగిల్ వర్డ్ లో పెద్ద థ్యాంక్స్ చెప్పేసింది. ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడ రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో వెల్కమ్ బ్యాక్ అంటూ రాసిన ప్లేట్ కనిపిస్తుంది. దీంతో ఆమె మళ్లీ సినిమాలలో పాల్గొనాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు