Guntur Kaaram latest : గుంటూరు కారం సినిమాపై ఫైనల్ గా ఒక్క గుడ్ న్యూస్

Guntur Kaaram latest news

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం సినిమాపై ఎట్టకేలకు ఒక్క గుడ్ న్యూస్ బయట పడింది. గత కొద్దీ రోజులుగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ సినిమా నుంచి ఎలాంటి న్యూస్ వచ్చిన మహేష్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలవుతున్న సమయంలో ఈ గుడ్ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ లో కొంతవరకు హప్పినెస్ ను నింపిందని చెప్పవచ్చు.

త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న గుంటూరు కారం సినిమా ఇటీవల కాలంలో బిగ్ బాస్ హౌస్ లాగా మారిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోలో వారానికొక కంటెస్టెంట్ ఎలిమేట్ అయ్యినట్టు గుంటూరు కారం సినిమా నుంచి కూడా ఒక్కొక్క టెక్నీషియన్ వాక్ అవుట్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే హీరోయిన్ పూజా హెగ్డే, సినిమాటోగ్రాఫర్ పీస్ వినోద్ , ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ లు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో గుంటూరు కారం సినిమా ప్రొడక్షన్ లో ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. దాంతో తొందర్లోనే ఈ సినిమా అటకెక్కడం ఖాయం అంటూ మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

ఇక లేటెస్ట్ మహేష్ బాబు అభిమానుల చెవుల్లో అమృతం పోసినట్టు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు కమెడియన్ సునీల్. ఇటీవలనే సునీల్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో నటించాడు. ప్రస్తుతం జైలర్ సినిమా రిలీజై, ప్రేక్షకుల దగ్గర నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటుండగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సునీల్ గుంటూరు కారం సినిమా గురించి ఒక మంచి న్యూస్ బయట పెట్టాడు.

- Advertisement -

ఇప్పటి వరకు మహేష్ బాబు చేసిన క్లాస్ సినిమాలన్నీ మర్చిపోయే విధంగా గుంటూరు కారం సినిమా ఉండబోతుందని అని ఆయన తెలిపారు. మునుపెన్నడూ మహేష్ బాబు చేయని అవుట్ అండ్ అవుట్ మాస్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారని సునీల్ చెప్పగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏది ఏమైనా గుంటూరు కారం సినిమా గురించి ఇటీవల కాలంలో వచ్చిన న్యూస్ లలో ఈ న్యూస్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు