Anjali : ఆ ఫ్లాప్ సినిమాకు ఎందుకయ్యా పార్ట్ 2 ?

Anjali

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ట్ అయిన కొత్త ట్రెండ్ ను బట్టి ఇటీవల కాలంలో హిట్టైన సినిమాలకు సీక్వెల్ మరియు పార్ట్ 2 అంటూ ఒకే కథ, పాత్రలతో సినిమాలు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది తప్పేమి కాదు. ఎందుకంటే ఈ విధంగా హిట్టైన సినిమాలకు పార్ట్ 2 సినిమాలు మేకర్స్ చేస్తుండటానికి కారణం ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండే. కానీ కొంతమంది ఫిలిం మేకర్స్ మాత్రం ఈ ట్రెండ్ ను అడ్వాంటేజ్ గా తీసుకొని ఫ్లాప్ సినిమాకు కూడా సీక్వెల్స్ రెడీ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 2014 లో నటి అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం గీతాంజలి. ప్రముఖ కమెడియన్ శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో హీరోగా నటించాడు. హార్రర్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్టర్ రాజ్ కిరణ్ తెరకెక్కించగా, ప్రముఖ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించారు.యంవివి పిక్చర్స్ బ్యానర్ పై సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

గీతాంజలి సినిమాకు గాను నటన పరంగా హీరోయిన్ అంజలి కి మంచి గుర్తింపు లభించింది. అలాగే ఈ సినిమాకు ఆమె నంది అవార్డు కూడా అందుకుంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. లేటెస్ట్ గా చూస్తే 2014లో బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినా ఈ సినిమాకు ప్రస్తుతం కోన వెంకట్ & టీం పార్ట్ 2 చేస్తున్నారు. అయితే ఈ సినిమా పార్ట్ 2 చేయమని ప్రేక్షకుల బలమైన డిమాండ్ గాని క్రేజ్ గాని అస్సలు లేదు. కానీ ప్రేక్షకుల ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండా ఈ సినిమా టీం ప్రస్తుతం గీతాంజలి సినిమాకు పార్ట్ 2 చేసే పనిలో పడ్డారు. ఈరోజు లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే పేరు తో ఈ సినిమా రాబోతున్నట్టు కాసేపటి క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. దాంతో సోషల్ మీడియాలో అందరు ఎవరడిగారని ఈ సినిమాకు పార్ట్ 2 చేస్తున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు