Brahmastra : అంత నమ్మకమా ?

గత ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా సినీ మీడియాలో చర్చ జరుగుతున్న చిత్రం “బ్రహ్మాస్త్ర”. ఈ సినిమాని రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ కేటాయించి బ్రహ్మాస్త్ర సినిమాను రూపొందించారు. రియల్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో ఇవాళ విడుదల అయింది.

ఈ భారీ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మూడు పార్ట్ లుగా  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక సౌత్ ఇండియాలో రాజమౌళి ఈ సినిమాని ప్రమోట్ చేశాడు. ఎన్టీఆర్ ఈ సినిమా  ప్రెస్ మీట్ లో పాల్గొని ఆసక్తి పెరిగే విధంగా మాట్లాడారు.

రణబీర్ కపూర్, ఆలియా పెళ్లి తర్వాత రాబోతున్న మొదటి సినిమా ఇదే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారని.. ఈ మూవీ హిట్ అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు అర్పిస్తానని మొక్కుకున్నారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు